తొలిరోజు 723 వాహనాల విడుదల
ABN , First Publish Date - 2020-05-15T10:32:59+05:30 IST
రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు పెద్దపల్లి డీసీపీ రవీందర్, గోదావరిఖని ఏసీపీ ఏసీపీ ఉమేందర్ పర్యవేక్షణలో లాక్డౌన్
కోల్సిటీ, మే 14: రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు పెద్దపల్లి డీసీపీ రవీందర్, గోదావరిఖని ఏసీపీ ఏసీపీ ఉమేందర్ పర్యవేక్షణలో లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనలతో గోదావరిఖని సబ్డివిజన్ పోలీసులు పట్టుకున్న వాహనాల్లో గురువారం 723వాహనా లు విడుదలయ్యాయి. వీటికి రూ.4,47,000 ఈ-చలాన్ ద్వా రా జరిమానా విధించారు.
ఈ సందర్భంగా అధికారులు వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి పెండింగ్లో ఉన్న చలాన్లను త్వరలో కట్టాలని సూచించారు. విధించిన ఈ- చలాన్లను కూడా రెండుమూడు రోజుల్లో మీసేవా కేంద్రాల్లో గానీ, పేటిఎం, టీఎస్వ్యాలెట్ ద్వారా గానీ జరిమానా చెల్లిం చాలని లేకపోతే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు అత్యవసర పరిస్థితుల్లో తప్ప అనవసరంగా బయటకు రావద్దని సూచించారు.