బీజేపీ కార్పొరేటర్‌కు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే స్వీట్‌

ABN , First Publish Date - 2020-12-07T17:05:06+05:30 IST

గాంధీనగర్‌ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన కార్పొరేటర్‌ ఎ.పావనీవిజయ్‌కుమార్‌కు ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ స్వీట్‌ తినిపించి, అభినందించారు.

బీజేపీ కార్పొరేటర్‌కు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే స్వీట్‌

చిక్కడపల్లి: గాంధీనగర్‌ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన కార్పొరేటర్‌ ఎ.పావనీవిజయ్‌కుమార్‌కు ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ స్వీట్‌ తినిపించి, అభినందించారు. ఈ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు ఉండగా, అన్ని చోట్లా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓడిపోయారు. ఐదు డివిజన్లలో బీజేపీ విజయపతాక ఎగురవేసింది. ముఖ్యంగా గాంధీనగర్‌ డివిజన్‌లో ఎమ్మెల్యే మరదలు ముఠా పద్మ పోటీ చేశారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి ఎ.పావనీవిజయ్‌కుమార్‌ విజయం సాధించారు. కాగా, ఆదివారం డివిజన్‌లోని జవహర్‌నగర్‌లో పద్మశాలి సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సమ్మేళనానికి గాంధీనగర్‌ కార్పొరేటర్‌ ఎ. పావనివినయ్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ఆమెను ప్రత్యేకంగా అభినందించి స్వీట్‌ తినిపించడంతో అక్కడ ఉన్న వారంతా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. తన మరదలిని ఓడించిన కార్పొరేటర్‌ను ఎమ్మెల్యే ప్రశంసించడంతో.. ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా పని చేయాలన్న దానికి ఇది ఉదాహరణగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-07T17:05:06+05:30 IST