‘విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలి’
ABN , First Publish Date - 2020-05-23T10:58:40+05:30 IST
లాక్డౌన్ నేపథ్యంలో మార్చి నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు విద్యుత్ బిల్లులను ప్రభుత్వం మాఫీ చేయాలని ఓబీసీ సెంట్రల్
బర్కత్పుర, మే 22(ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ నేపథ్యంలో మార్చి నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు విద్యుత్ బిల్లులను ప్రభుత్వం మాఫీ చేయాలని ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్పర్సన్ ఎం.భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. శుక్రవారం కాచిగూడలోని ఓబీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా గ్రూపుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన వారికి మారిటోరియం మూడు నెలల నుంచి ఆరునెలలకు పొడిగించాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.