23న నిథమ్‌లో వెబినార్‌

ABN , First Publish Date - 2020-05-17T11:03:35+05:30 IST

గచ్చిబౌలిలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ, టూరిజం (నిథమ్‌) ఆధ్వర్యంలో 23వ తేదీన వెబినార్‌ (ఆన్‌లైన్‌ సెమినార్‌)

23న నిథమ్‌లో వెబినార్‌

రాయదుర్గం, మే 16(ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలిలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ, టూరిజం (నిథమ్‌) ఆధ్వర్యంలో 23వ తేదీన వెబినార్‌ (ఆన్‌లైన్‌ సెమినార్‌) నిర్వహిస్తున్నట్టు నిథమ్‌ ప్రిన్సిపాల్‌ నరేందర్‌కుమార్‌ తెలిపారు. హోటళ్లు, పర్యాటక రంగానికి చెందిన ప్రముఖులు ప్యానల్‌ డిస్కషన్‌లో పాల్గొంటారని తెలిపారు. హోటల్‌ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలపై ఈ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.


పాల్గొనదలిచిన వారు జూమ్‌యాప్‌ ద్వారా తమ పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకుని పాల్గొనవచ్చన్నారు. తెలంగాణ హోటల్‌, రెస్టారెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌ హేమ్‌రాజాని, హైటెక్‌సిటీ హైదరాబాద్‌ రాడిసన్‌ హోటల్‌ జనరల్‌ మేనేజర్‌ అలోక్‌ కౌవ్‌, హోటల్‌ సహారా స్టార్‌ చెఫ్‌ సలీల్‌ పడ్నేస్‌ హాజరై స్పీకర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. కార్యక్రమాన్ని జూమ్‌యాప్‌ ద్వారా లైవ్‌ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-17T11:03:35+05:30 IST