ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
ABN , First Publish Date - 2020-09-14T09:47:09+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
రాంనగర్, సెప్టెంబర్ 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం విద్యానగర్లోని అనాథ ఆశ్రమంలో విద్యార్థులకు నోట్పుస్తకాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్.కృష్ణయ్య విద్యార్థులకు నోట్పుస్తకాలను పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇంటర్నెట్, స్మాట్ ఫోన్ అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు లాల్కృష్ణ, వేముల రామకృష్ణ, జయంత్గౌడ్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.