ఎంఎల్‌ఆర్‌ఐటీకళాశాలకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు

ABN , First Publish Date - 2020-10-04T09:53:14+05:30 IST

ఎంఎల్‌ఆర్‌ఐటీకళాశాలకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు

ఎంఎల్‌ఆర్‌ఐటీకళాశాలకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు

దుండిగల్‌, అక్టోబర్‌ 3 (ఆంధ్రజ్యోతి):దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఎల్‌ఆర్‌ఐటీ) కళాశాలకు అరుదైన గుర్తింపు లభించింది. భారత ప్రభుత్వ సంస్థ అయిన మహాత్మాగాంధీ నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌ (ఎంజీఎన్‌సీఆర్‌ఈ) వారు ఎంఎల్‌ఆర్‌ఐటీ కళాశాలను గుర్తింపు పొందిన రికగ్నైజ్డ్‌ సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, స్వచ్ఛతా అండ్‌ రూరల్‌ ఎంగేజ్‌మెంట్‌ సెల్‌ (ఎస్‌ఈఎస్‌ఆర్‌ఈసీ)గా ఎంపిక చేశారు. కళాశాల అధ్యాపకులను, విద్యార్థులను భాగస్వాములు చేస్తూ స్వచ్ఛత, పర్యావరణ సమతుల్యత, దత్తత తీసుకున్న గ్రా మాల వికాసంకోసం కళాశాల చేసిన విశేష కృషికి ఈ అరుదైన గుర్తింపు లభించింది. గ్రామీణ మహిళలకు వివిధ రకాల వృత్తు ల్లో, తయారీ రంగాల్లో తగు శిక్షణ ఇస్తూ వారిని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తోందని కళాశాల కార్యదర్శి మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. 

Updated Date - 2020-10-04T09:53:14+05:30 IST