టీడీపీ ప్రచారాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్..!
ABN , First Publish Date - 2020-11-26T20:28:56+05:30 IST
కేపీహెచ్బీ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ అభ్యర్థి మందడి శ్రీనివాసరావు వర్గీయలు బుధవారం అడ్డుకున్నారు. ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి పద్మా చౌదరి తరఫున ఆమె కూతురుప్రియదర్శిని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేపీహెచ్బీ 9వ ఫేజ్లో ప్రచారం చేస్తున్నారు.
ఓటమి భయంతోనే : పద్మా చౌదరి
కేపీహెచ్బీ కాలనీ, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): కేపీహెచ్బీ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ అభ్యర్థి మందడి శ్రీనివాసరావు వర్గీయలు బుధవారం అడ్డుకున్నారు. ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి పద్మా చౌదరి తరఫున ఆమె కూతురుప్రియదర్శిని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేపీహెచ్బీ 9వ ఫేజ్లో ప్రచారం చేస్తున్నారు. అదే కాలనీలో టీఆర్ఎస్ కార్పొరేటర్ మందడి నివాసం ఉండటంతో ప్రచారాన్ని ఆపేసి వెళ్లిపోవాలంటూ టీఆర్ఎస్ నాయకులు హుకుం జారీ చేశారు. అక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని టీడీపీ కార్యకర్తలు బదులిచ్చారు. ప్రచారానికి పోలీసుల అనుమతి తీసుకున్నామని తెలిపారు. ప్రచారాన్ని అడ్డుకున్నంత మాత్రాన విజయం సాధించినట్టు అనుకుంటున్నారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2016 ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై గెలిచి స్వార్థ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్లోకి వెళ్లడమే కాకుండా తాజాగా టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవడం ఏంటని ప్రియదర్శిని టీఆర్ఎస్ అభ్యర్థి వర్గీయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి పద్మా చౌదరి అక్కడికి చేరుకున్నారు. టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న శ్రీనివాసరావు ఏ పార్టీ గుర్తుతో గత ఎన్నికల్లో గెలిచారో గుర్తుపెట్టుకోవాలన్నారు. టీఆర్ఎస్ ఓడిపోతుందన్న భయంతోనే టీడీపీ ప్రచారాన్ని అడ్డుకున్నారని విమర్శించారు.