మూడ్రోజుల క్రితం సింగపూర్ నుంచి వచ్చిన ఆరుగురిలో.. ముగ్గురికి..

ABN , First Publish Date - 2020-03-24T16:38:50+05:30 IST

ఖైరతాబాద్‌ ఆనంద్‌నగర్‌ కాలనీలో కరోనా కలకలం రేపింది. ఈనెల 21న సింగపూర్‌ నుంచి నగరానికి వచ్చిన ఆరుగురులో ముగ్గురికి సోమవారం తీవ్ర జ్వరం, దగ్గు, వాంతులు కావడంతో జీహెచ్‌ఎంసీ, ఇతర విభాగాల అధికారులకు సమాచారం అందించారు.

మూడ్రోజుల క్రితం సింగపూర్ నుంచి వచ్చిన ఆరుగురిలో.. ముగ్గురికి..

ఆనంద్‌నగర్‌ కాలనీలో కలకలం

సింగపూర్ నుంచి ఆరుగురు..

ముగ్గురికి తీవ్ర జ్వరం, దగ్గు, వాంతులు

గాంధీ ఆస్పత్రికి తరలింపు..


పంజాగుట్ట, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్‌ ఆనంద్‌నగర్‌ కాలనీలో కరోనా కలకలం రేపింది. ఈనెల 21న సింగపూర్‌ నుంచి నగరానికి వచ్చిన ఆరుగురులో ముగ్గురికి సోమవారం తీవ్ర జ్వరం, దగ్గు, వాంతులు కావడంతో జీహెచ్‌ఎంసీ, ఇతర విభాగాల అధికారులకు సమాచారం అందించారు. దీంతో ప్రత్యేక బృందాలు అంబులెన్స్‌తో వచ్చి వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, మరొకరు సింగపూర్‌ నుంచి నగరానికి వచ్చారు. విమానాశ్రయంలో వారికి పరీక్ష నిర్వహించారు. స్టాంపింగ్‌ కూడా వేశారు. ఇంట్లో క్వారంటైన్‌గా ఉండాలని సూచించారు. దీంతో వారు ప్రత్యేక వాహనంలో ఇంటికి చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఓ వృద్ధురాలికి, ఇద్దరు చిన్నారులకు తీవ్ర జ్వరం రావడమే కాకుండా విపరీతంగా దగ్గు, వాంతులు అయ్యాయి. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా, పరిసరాల్లో మందులను పిచికారి చేశారు. 

Updated Date - 2020-03-24T16:38:50+05:30 IST