‘సచివాలయ ప్రాంగణంలో ఆలయాలు నిర్మించాలి’
ABN , First Publish Date - 2020-09-06T09:47:02+05:30 IST
సచివాలయ ప్రాంగణంలోని ఆలయాలను కూల్చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు అదే ..
మంగళ్హాట్, సెప్టెంబర్ 5(ఆంధ్రజ్యోతి): సచివాలయ ప్రాంగణంలోని ఆలయాలను కూల్చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు అదే స్థానంలో ఆలయాలను నిర్మించాలని.. లేనిపక్షంలో విశ్వహిందూ పరిషత్ కరసేవ నిర్వహించి ఆలయాలను నిర్మిస్తుందని వీహెచ్పీ రాష్ట్ర నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, కార్యదర్శి బండారి రమేష్ బహిరంగ లేఖ రాశారు. యఽథాస్థానంలో ఆలయాలను నిర్మించేందుకు పీఠాధిపతులు, స్వామీజీలు, ఽథార్మిక, ఆధ్యాత్మిక సంస్థలతో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటించాలన్నారు.