ఎవరి నుంచి ముప్పు ఉందో చెప్పండి
ABN , First Publish Date - 2020-09-01T10:35:09+05:30 IST
తనకు ఎవరి నుంచి ముప్పు పొంచి ఉందో చెప్పాలని హోంమంత్రి మహమూద్ అలీని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. భద్రతా కారణాలవల్ల

పెండింగ్లో ఉంచిన గన్ లైసెన్స్ ఇవ్వండి
హోంమంత్రిని కోరిన ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): తనకు ఎవరి నుంచి ముప్పు పొంచి ఉందో చెప్పాలని హోంమంత్రి మహమూద్ అలీని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. భద్రతా కారణాలవల్ల ద్విచక్ర వాహనంపై తిరగొద్దని రాజాసింగ్కు ఇటీవల హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోం మంత్రిని ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం కలిశారు.
తనకు ముప్పు ఉందని చెబుతున్న పోలీసులు ఆత్మరక్షణ కోసం తాను దరఖాస్తు చేసుకున్న గన్ లైసెన్స్ను రెండేళ్లుగా పెండింగ్లో ఉంచారని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.