గ్రేటర్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మాకే ఉంది: టీడీపీ
ABN , First Publish Date - 2020-11-26T16:00:02+05:30 IST
గ్రేటర్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు తమకే ఉందని టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
![గ్రేటర్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మాకే ఉంది: టీడీపీ](https://media.andhrajyothy.com/appimg/galleries/2020112610282225/11262020102911n40.jpg)
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు తమకే ఉందని టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది చంద్రబాబు, ఎన్టీఆర్ మాత్రమే అన్నారు. ఏఎస్రావు డివిజన్ టీడీపీ అభ్యర్థి దూడల నిర్మల సాంబమూర్తి గౌడ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మహిళలు, పార్టీ నాయకులతో కలసి ఆమె ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని.. తనను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని నిర్మల సాంబమూర్తి గౌడ్ చెబుతున్నారు.