రేపు రాష్ట్రవ్యాప్త నిరాహార దీక్షలు: ఆర్.కృష్ణయ్య
ABN , First Publish Date - 2020-06-25T09:54:26+05:30 IST
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు

రాంనగర్, జూన్ 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ అధ్యక్షతన బుధవారం విద్యానగర్ బీసీ భవన్లో నిర్వహించిన నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. రిటైర్మెంట్ వల్ల వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏర్పడ్డ రెండు లక్షల యాభై వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశా రు. టెట్ నోటిఫికేషన్ను వెంటనే జారీ చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పలు బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.