సికింద్రాబాద్-సీతామర్హి మధ్య ప్రత్యేక రైలు
ABN , First Publish Date - 2020-11-06T10:13:55+05:30 IST
ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్-సీతామర్హి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్న ట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-సీతామర్హి స్పెషల్ (రైల్ నెంబర్: 07027) సికింద్రాబాద్ నుంచి ఈనెల 10వ
![సికింద్రాబాద్-సీతామర్హి మధ్య ప్రత్యేక రైలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సికింద్రాబాద్, నవంబర్ 5 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్-సీతామర్హి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్న ట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-సీతామర్హి స్పెషల్ (రైల్ నెంబర్: 07027) సికింద్రాబాద్ నుంచి ఈనెల 10వ తేదీ రాత్రి 8 గంటలకు బయల్దేరి, రెండోరోజు ఉద యం 6.45 గంటలకు సీతామర్హి చేరుతుంది. ఈ రైలు కాజీపేట్, రామగుండం, సిర్పూర్ కాగజ్నగర్, బలార్షా, గొండియా, రాయ్పూర్, బిలా్్సపూర్, జర్సుగూడ, రూర్కెలా, రాంచి, బొకారో స్టీల్ సిటీ, ధన్బాద్, మాదాపూర్, బరౌనీ జం క్షన్, సమస్తిపూర్, దర్భంగ స్టేషన్ల మీదుగా వెళ్తుంది.