సనత్నగర్ ప్రభుత్వ పాఠశాల..విద్యార్థినికి ఐఐటీ బాసరలో సీటు
ABN , First Publish Date - 2020-10-21T11:04:43+05:30 IST
సనత్నగర్ ప్రభుత్వ స్కూల్లో చదివిన విద్యార్థిని రేవతికి ఐఐటీ బాసరలో సీటు వచ్చింది. ఆ విద్యార్థిని తల్లి ఓ ప్రైవేట్ హాస్టల్లో పనిచేస్తూ తన కుమార్తెను ప్రభుత్వ స్కూల్లో చదివించింది.
సనత్నగర్, అక్టోబర్ 20 (ఆంధ్రజ్యోతి): సనత్నగర్ ప్రభుత్వ స్కూల్లో చదివిన విద్యార్థిని రేవతికి ఐఐటీ బాసరలో సీటు వచ్చింది. ఆ విద్యార్థిని తల్లి ఓ ప్రైవేట్ హాస్టల్లో పనిచేస్తూ తన కుమార్తెను ప్రభుత్వ స్కూల్లో చదివించింది. రేవతి సనత్నగర్లోని ప్రభుత్వ పాత పాఠశాలలో మూడోతరగతి నుంచి పదోతరగతి వరకు చదివింది. ఆమెకు పదోతరగతిలో 10/10 జీపీఏ సాధించింది. దీంతో మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో రేవతి ఐఐటీ సీటు సాధించడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు.