సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలో పూల మొక్కల విక్రయం

ABN , First Publish Date - 2020-07-28T09:48:07+05:30 IST

నగర ప్రజలతో పాటు రైతులకు పంటల సాగులో మెళకువలు నేర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్‌ జిల్లా శివారు జీడిమెట్ల

సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలో పూల మొక్కల విక్రయం

పేట్‌బషీరాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): నగర ప్రజలతో పాటు రైతులకు పంటల సాగులో మెళకువలు నేర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్‌ జిల్లా శివారు జీడిమెట్ల గ్రామం పైపులైన్‌ రహదారి పక్కనే సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీని ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాల రైతులు, అగ్రికల్చర్‌ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు సైతం ఇక్కడికొచ్చి సాగు వివరాలను తెలుసుకుంటున్నారు. కుండీతో పాటు పూలు పూసిన మొక్కను రూ.300కే విక్రయిస్తున్నారు. సేంద్రియ ఎరువులను తక్కువ ధరలకే అందిస్తున్నామని ఉద్యానవన సహాయ సంచాలకుడు రాజ్‌కుమార్‌ తెలిపారు. రైతులు పంటలను ఎక్కువగా పండించుకోవడానికి భూసార నీటి పరీక్షలు నిర్వహించుకొనేలా కోరమాండల్‌ కంపెనీ సహకారంతో పంటల సాగుబడిపై సూచనలు సలహాలు ఇస్తున్నామన్నారు. వివరాలకు ఫోన్‌ నెం.7997724922, 7997724956, 7997725065లను సంప్రదించాలని పేర్కొన్నారు.

Updated Date - 2020-07-28T09:48:07+05:30 IST