ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : తలసాని
ABN , First Publish Date - 2020-09-23T10:07:00+05:30 IST
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన తన
అమీర్పేట, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన తన నివాసంలో కొంతకాలంగా అనారోగ్యం బారిన పడి చికిత్స అనంతరం కోలుకున్న బాపూనగర్కు చెందిన భరత్కు రూ.60 వేలు, సువాలీభాయ్కి రూ.40 వేలు సీఎం సహాయనిధి చెక్కులను కార్పొరేటర్ శేషుకుమారితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షలా మారిన ఈ రోజుల్లో అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి వర్గాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందన్నారు. కార్యక్రమంలో హరిసింగ్, లలిత గోపీలాల్ చౌహాన్, కరుణాకర్ రెడ్డి, అమర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.