ఖైరతాబాద్‌ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు

ABN , First Publish Date - 2020-05-10T10:49:12+05:30 IST

లాక్‌డౌన్‌లో ఖైరతాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించారు.

ఖైరతాబాద్‌ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు

పంజాగుట్ట, మే 8 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌లో ఖైరతాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌లో శనివారం నిర్వహించిన తరగతుల్లో కాంతి, కాంతి పరావర్తనం, కాంతి లక్షణాలు వంటి అంశాలపై ప్రముఖ జర్మనీ భౌతిక శాస్త్రవేత్త ముప్పవరపు రాజేష్‌ ప్రసంగించారు.


మరో కార్యక్రమంలో కరోనా సంక్షోభంలో ఆర్థిక శాస్త్ర పరిశీలన అనే అంశంపై ఆర్థిక శాస్త్రవేత్త, జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ అందె సత్యం ప్రసంగించారు. కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డీఎస్‌ఆర్‌ రాజేందర్‌సింగ్‌ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భౌతిక శాస్త్రవిభాగ అధిపతి డాక్టర్‌ చందన, కిషోర్‌కుమార్‌, వరలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2020-05-10T10:49:12+05:30 IST