పెళ్లయిన ఐదు రోజులకే నవవధువు అదృశ్యం..

ABN , First Publish Date - 2020-03-27T16:43:38+05:30 IST

వివాహం అయిన ఐదు రోజులకే ఓ నవవధువు అదృశ్యమైంది. కూరగాయలకు కొనేందుకు వెళ్లిన ఆ మహిళ కనిపించకుండా పోయింది.. ఎంతకూ భార్య ఇంటికి రాకపోవడంతో ఆ భర్త.. అంతా వెతికి చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు

పెళ్లయిన ఐదు రోజులకే నవవధువు అదృశ్యం..

కాచిగూడలో నవవధువు అదృశ్యం 

బర్కత్‌పుర, హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): వివాహం అయిన ఐదు రోజులకే ఓ నవవధువు అదృశ్యమైంది. కూరగాయలకు కొనేందుకు వెళ్లిన ఆ మహిళ కనిపించకుండా పోయింది.. ఎంతకూ భార్య ఇంటికి రాకపోవడంతో ఆ భర్త.. అంతా వెతికి చివరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్‌లోని కాచిగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన జరిగింది. హైదరాబాద్‌లోని కామ్‌గార్‌ నగర్‌లో నివాసం ఉంటున్న సత్యనారాయణకు ఐశ్వర్య(20)తో ఈనెల 20న వివాహం అయ్యింది. ఉగాది సందర్భంగా నిత్యావసర వస్తువులు తీసుకురావడానికి ఐశ్వర్య కిరాణాషాపునకు వెళ్లింది..


ఆమె వెళ్లి ఎన్ని గంటలయినా తిరిగి రాకపోవడంతో సత్యనారాయణ కూడా దుకాణానికి వెళ్లాడు.. ఆ చుట్టుపక్కల అంతా గాలించాడు. అయినప్పటికీ ఆమె కనిపించలేదు.. భార్య తిరిగొస్తుందని బుధవారం అంతా వేచిచూసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గురువారం భర్త సత్యనారాయణ కాచిగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-03-27T16:43:38+05:30 IST