అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-03-27T08:48:46+05:30 IST

నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకా్‌షగౌడ్‌ హెచ్చరించారు.

అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ హెచ్చరిక 


నార్సింగ్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకా్‌షగౌడ్‌ హెచ్చరించారు. గురువారం ఆయన మణికొండలోని పలు కూరగాయల దుకాణాలను, సూపర్‌ మార్కెట్‌లను సందర్శించి మాట్లాడారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం కూరగాయల ధర నిర్ణయించిందని, ఆ ధర ప్రకారమే విక్రయాలు చేపట్టాలని   సూచించారు.  కాగా మణికొండ మున్సిపాల్టీకి ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన జెట్‌లాకింగ్‌ పారిశుధ్య యంత్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కస్తూరి నరేందర్‌, వైస్‌ ఛైర్మన్‌ కె.నరేందర్‌రెడ్డి, కమిషనర్‌ జయంత్‌, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-27T08:48:46+05:30 IST