నేడు మంత్రి కేటీఆర్ రోడ్షో షెడ్యూల్
ABN , First Publish Date - 2020-11-25T14:22:54+05:30 IST
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రోడ్షోలతో ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రోడ్షోలతో ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజు వివిధ ప్రాంతాల్లో రోడ్షోలు నిర్వహిస్తూ ప్రజలతో ముచ్చటిస్తున్నారు. ఈ రోజు పలు ప్రాంతాల్లో కేటీఆర్ రోడ్ షో జరుగనుంది. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4గంటలకు ఈసీఐఎల్ చౌరస్తాలో, సాయంత్రం 5 గంటలకు శివ హోటల్ జుంక్షన్, మల్లాపూర్, 6 గంటలకు చిలుకానగర్ జుంక్షన్, 7గంటలకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్లో మంత్రి కేటీఆర్ రోడ్షోలు నిర్వహించనున్నారు.