పుకార్ల వల్లే ఢిల్లీలో అల్లర్లు
ABN , First Publish Date - 2020-03-02T09:36:16+05:30 IST
పుకార్ల వల్లే ఢిల్లీలో అల్లర్లు జరిగాయని, సోషల్ మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మం త్రి కిషన్రెడ్డి అన్నారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి
రాయదుర్గం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): పుకార్ల వల్లే ఢిల్లీలో అల్లర్లు జరిగాయని, సోషల్ మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మం త్రి కిషన్రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని ఐఎ్సబీలో ఆదివారం 2020-ఐఎ్సబీ పాలసీ కాంక్లేవ్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కిషన్రెడ్డి మాట్లాడుతూ ఎంత పెద్ద సమస్య అయినా చర్చించుకుంటే పరిష్కారం లభిస్తుందన్నారు. ఐఎ్సబీ లాంటి ఉన్నత విద్యాలయాల్లో డిబేట్స్ నిర్వహించడం వల్ల దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశాన్ని తెలుసుకోవచ్చున్నారు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో దూసుకు వెళ్తున్న భారత్వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన ఐఎ్సబీ క్యాంప్సలో మొక్కను నాటారు. కార్యక్రమంలో ఐఎ్సబీ డిప్యూటీ డీన్ సంజయ్, తదితరులు పాల్గొన్నారు.