గాంధీలో 5 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు: ఈటల
ABN , First Publish Date - 2020-12-30T01:36:09+05:30 IST
గాంధీ ఆసుపత్రిలో అవయవమార్పిడి కోసం 5 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో అవయవమార్పిడి కోసం 5 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రూ. 35 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. లివర్, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు మరో 9 నెలల్లో గాంధీలో అందుబాటులోకి తెస్తామన్నారు. 20 గంటల పాటు ఆపరేషన్స్ చేసేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఇన్ఫెక్షన్స్ రాకుండా అత్యాధునిక పద్దతుల్లో థియేటర్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.