పాతబస్తీ శాస్త్రీపురంలో ఓటేసిన అసదుద్దీన్ ఓవైసీ

ABN , First Publish Date - 2020-12-01T14:21:42+05:30 IST

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాతబస్తీలోని శాస్త్రీపురం పోలింగ్ బూత్‌లో అసదుద్దీన్ ఓటు వేశారు

పాతబస్తీ శాస్త్రీపురంలో ఓటేసిన అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాతబస్తీలోని శాస్త్రీపురం పోలింగ్ బూత్‌లో అసదుద్దీన్ ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని వినతి చేశారు. పెద్ద పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొని  పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. హైదరాబాద్ అభివ‌ృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు హైదరాబాద్‌‌లోని ప్రతీ ఓటరు ఇంటి నుంచి బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు కాబట్టి ప్రధానంగా యువత ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని  అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. 

Updated Date - 2020-12-01T14:21:42+05:30 IST