మాసబ్ చెరువుకు గంగ పూజలు
ABN , First Publish Date - 2020-10-23T10:01:08+05:30 IST
మాసబ్ చెరువు వద్ద తుర్కయంజాల్ మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు గురువారం గంగ పూజలు నిర్వహించారు.
హయత్నగర్, అక్టోబర్ 22 (ఆంధ్రజ్యోతి): మాసబ్ చెరువు వద్ద తుర్కయంజాల్ మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు గురువారం గంగ పూజలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలను అమ్మవారికి సమర్పించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ హరితధన్రాజ్గౌడ్, కౌన్సిలర్లు కొశిక ఐలయ్య, మంగమ్మ, శివలింగం, నరేందర్రెడ్డి, కవిత, మాధవి, అనిత, శ్రీలత, సునీల్ పాల్గొన్నారు. కాగా రొక్కం సత్తిరెడ్డి గార్డెన్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులకు చైర్మన్ అనురాధరాంరెడ్డి, పాలకవర్గం సభ్యులు దుస్తులను అందజేశారు.