25వరకు లీడ్‌ ఇండియా కొవిడ్‌ 19 పోటీ పరీక్షలు

ABN , First Publish Date - 2020-07-09T10:20:40+05:30 IST

విద్యార్థులలో సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసం విలువలతో కూడిన విద్యాస్థాయి నైపుణ్యం పెంపొందించేందుకు ..

25వరకు లీడ్‌ ఇండియా కొవిడ్‌ 19 పోటీ పరీక్షలు

ముషీరాబాద్‌, జూలై 8(ఆంధ్రజ్యోతి): విద్యార్థులలో సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసం విలువలతో కూడిన విద్యాస్థాయి నైపుణ్యం పెంపొందించేందుకు  ‘లీడ్‌ ఇండియా కొవిడ్‌ 19 చాంపియన్‌ షిప్‌’ ఆన్‌లైన్‌ లెవల్‌ వన్‌ పోటీ పరీక్షలను ఈనెల 25 వరకు పొడిగించారు. ఈ మేరకు లీడ్‌ ఇండియా ప్రైవేట్‌ స్కూల్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ముఖ్య సలహాదారులు పాపిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ఎన్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాంచంద్రారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి నుంచి డిగ్రీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు ఎలాంటి రుసుం లేదని తెలిపారు. ప్రతిరోజూ 24 గంటల పాటు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థికీ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్‌ లీడ్‌ ఇండియా ఫౌండేషన్‌ డాట్‌ ఆర్గనైజేషన్‌/కొవిడ్‌-19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


Updated Date - 2020-07-09T10:20:40+05:30 IST