ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే దానం
ABN , First Publish Date - 2020-12-01T14:38:16+05:30 IST
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు

హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెంకటేశ్వర కాలనీ డివిజన్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14, నంది నగర్లోని పోలింగ్ బూత్లో ఎమ్మెల్యే ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఓటు, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వినతి చేశారు. అభివృద్ధి చేసే వాళ్లకి ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ వినతి చేశారు.