సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ

ABN , First Publish Date - 2020-02-12T21:57:47+05:30 IST

సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కలెక్టర్ల సమావేశంలో 12 గంటల ఉపన్యాసం ఇచ్చిన సీఎం కేసీఆర్..

సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ

హైదరాబాద్: సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి లేఖ రాశారు.  కలెక్టర్ల సమావేశంలో 12 గంటల ఉపన్యాసం ఇచ్చిన సీఎం కేసీఆర్... కనీసం ఐదు నిమిషాలైనా రైతుల సమస్యలపై చర్చించలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్న నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ లెక్కలను ఆయన ప్రస్తావించారు. జనాభా ప్రకారం చూసుకుంటే... ఈ విషయంలో తెలంగాణ తొలిస్థానంలో ఉందని  విమర్శించారు. రైతు రుణమాఫీ, రైతుబంధు, రైతు సమన్వయ సమితిలు ఫెయిలయ్యాయని ధ్వజమెత్తారు. గడిచిన ఆరు నెలల్లో తెలంగాణలో 5,912 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటేనే... పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేలా... బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఉంటేనే పథకాలు అమలవుతాయి. లేకపోతే అన్నీ అటకెక్కినట్టే అని పేర్కొన్నారు.   

Updated Date - 2020-02-12T21:57:47+05:30 IST