జేఎన్టీయూహెచ్లో పరీక్షలు ప్రశాంతం
ABN , First Publish Date - 2020-09-18T09:34:44+05:30 IST
జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో బీటెక్, బీఫార్మసీ విద్యార్థులకు జరుగుతున్న చివరి సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా

హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 17 (ఆంధ్రజ్యోతి): జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో బీటెక్, బీఫార్మసీ విద్యార్థులకు జరుగుతున్న చివరి సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఆయా కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలకు హాజరు శాతం 96శాతం వరకు ఉందని జేఎన్టీయూ అధికారులు తెలిపారు. గతేడాదితో పోల్చితే హాజరుశాతం ఏమాత్రం తగ్గడం లేదని, మెరుగ్గానే ఉందని వెల్లడించారు. విద్యార్థులు చదువుకున్న కాలేజీల్లోనే పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో కొంత అనుకూలంగానే ఉన్నా కానీ, నగరంలోనూ, శివారు ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పరీక్షలకు హాజరయ్యేందుకు వారు ఇబ్బందులు పడుతున్నారు.