‘జనతా కర్ఫ్యూ’ విజయవంతం

ABN , First Publish Date - 2020-03-23T09:35:45+05:30 IST

కులమతాలకతీతంగా పాతబస్తీ, శివారు ప్రాంతాల ప్రజలు కరోనా వైరస్‌ నివారణ కోసం చేయి చేయి కలిపారు.

‘జనతా కర్ఫ్యూ’ విజయవంతం

చార్మినార్‌ జోన్‌బృందం, మార్చి22 (ఆంధ్రజ్యోతి) : కులమతాలకతీతంగా పాతబస్తీ, శివారు ప్రాంతాల ప్రజలు కరోనా వైరస్‌ నివారణ కోసం చేయి చేయి కలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ‘జనతా కర్ఫ్యూ’ను విజయవంతం చేశారు. పాతబస్తీలో ఎన్నడూలేని విధంగా ప్రజలు జనతా కర్ఫ్యూకు మద్దతు తెలిపి కరోనా వైర్‌సను అరికట్టడంలో నడుం బిగించారు. అక్కడకక్కడ యువకులు ద్విచక్ర వాహనాలపై కనిపించినప్పటికీ 98 శాతం మంది ప్రజలు ఇళ్ళకే పరిమితమయ్యాయి.


పాతబస్తీలోని చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, యాకుత్‌పురా నియోజకవర్గాలతోపాటు రాజేంద్రనగర్‌ సర్కిల్‌, జల్‌పల్లి మున్సిపాలిటీ ప్రజలు జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దుకాణాలు, వ్యాపార, వాణిజ్యసంస్థలు మూతపడ్డాయి. అదే  సమయంలో సాయంత్రం 5 గంటలకు ఇళ్ళ బయటకు వచ్చి కరోనా వైరస్‌ నివారణ కోసం కృషి చేస్తున్న వారికి  కృతజ్ఞతలు అంటూ చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేశారు.

Updated Date - 2020-03-23T09:35:45+05:30 IST