ఇండియన్‌ ఆయిల్‌ రిమోట్‌ మానిటరింగ్‌ ఆపరేషన్‌ కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-30T06:29:39+05:30 IST

గ్యాస్‌ టర్బైన్ల రిమోట్‌ ట్రాకింగ్‌ కోసం ఇండియన్‌ ఆయిల్‌ రిమోట్‌ మానిటరింగ్‌ ఆపరేషన్‌ కేంద్రాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మంగళవారం ప్రారంభించారు.

ఇండియన్‌ ఆయిల్‌ రిమోట్‌ మానిటరింగ్‌   ఆపరేషన్‌ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): గ్యాస్‌ టర్బైన్ల రిమోట్‌ ట్రాకింగ్‌ కోసం ఇండియన్‌ ఆయిల్‌ రిమోట్‌ మానిటరింగ్‌ ఆపరేషన్‌ కేంద్రాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మంగళవారం ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్టును బీహెచ్‌ఈఎల్‌- జనరల్‌ గ్యాస్‌ టర్బైన్‌ సర్వీసెస్‌ (బీజీజీటీఎ్‌స)తో పాటు భెల్‌, జనరల్‌ ఎలక్ట్రిక్‌ సంయుక్తంగా చేపట్టాయి. కార్యక్రమానికి ఇండియన్‌ ఆయిల్‌ చైర్మన్‌ ఎస్‌. ఎం. వైద్య, సీఎండీ-భెల్‌, డాక్టర్‌ నలిన్‌ షింగల్‌, కమలేష్‌ దాస్‌- చైర్మన్‌, బీజీజీటీఎస్‌ డైరెక్టర్‌, దీపే్‌షనందా, సీఈఓ-దక్షిణ ఆసియాతోపాటు పలువురు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. ఇండియన్‌ ఆయిల్‌ అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం గొప్ప ఆవిర్భావమని అన్నారు. అంతకుముందు మంత్రి రాష్ట్రంలోని చమురు మార్కెటింగ్‌ సంస్థల పరిశ్రమ పనితీరును సమీక్షించారు. 


Updated Date - 2020-12-30T06:29:39+05:30 IST