ఓటు వేసేందుకు వృద్ధునికి పోలీసుల సహాయం
ABN , First Publish Date - 2020-12-01T19:09:26+05:30 IST
ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఓ వృద్ధునికి తిరుమలగిరి పోలీసులు సహాయపడ్డారు.
హైదరాబాద్: ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఓ వృద్ధునికి తిరుమలగిరి పోలీసులు సహాయపడ్డారు. తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలోని పోలింగ్ స్టేషన్లో ఓటు వినియోగించుకోవటానికి వచ్చిన వృద్ధున్ని పోలీసులు వీల్చైర్పై పోలింగ్ స్టేషన్కు తీసుకువెళ్లి ఓటు వేయించారు. తిరుమలగిరి ఇన్స్పెక్టర్ కె రవి కుమార్, ఎస్సై వెంకటేశ్వర్లు సహాయాన్ని అందించారు.