బోరబండలో వరుస భూప్రకంపనలు

ABN , First Publish Date - 2020-10-03T13:21:30+05:30 IST

నగరంలోని బోరబండలో వరుస భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి.

బోరబండలో వరుస భూప్రకంపనలు

హైదరాబాద్: నగరంలోని బోరబండలో వరుస భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. గత రాత్రి బోరంబలో వరుసగా భూమికంపించింది. దీంతో ప్రజలకు భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భయంతో రాత్రి నుంచి  జాగారం చేశారు. భారీ శబ్దాలు, భూప్రకంపనలతో ఇప్పటికే కొంతమంది కాలనీవాసులు ఇల్లు ఖాళీ చేసిన పరిస్థితి నెకలొంది. మరోవైపు ఈరోజు బోరబండలోని సైట్-3, అల్లాపూర్, వీకర్స్ కాలనీలో ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తల బృందం పర్యటించనుంది. 

Updated Date - 2020-10-03T13:21:30+05:30 IST