రోడ్డు ప్రమాదంలో తల్లీ, 11నెలల చిన్నారి మృతి
ABN , First Publish Date - 2020-11-22T16:23:01+05:30 IST
నగరంలోని అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధి కోహెడ వద్ద ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
హైదరాబాద్: నగరంలోని అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధి కోహెడ వద్ద ఔటర్ రింగు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని వేగనర్ కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు తల్లి త్రివేణి, 11 నెలల కూతురు రీతిక మృతిగా గుర్తించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.