హైదరాబాద్లో ఫాస్ట్ఫుడ్ సెంటర్పై దాడి
ABN , First Publish Date - 2020-10-01T17:29:50+05:30 IST
నగరంలోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆజామాబాద్లో స్పైస్ ఫాస్ట్ పుడ్ సెంటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
హైదరాబాద్: నగరంలోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆజామాబాద్లో స్పైస్ ఫాస్ట్ పుడ్ సెంటర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ముఖాలకు మాస్క్లు ధరించి మరీ.. నిర్వాహకులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాదాపు ఆరుగురు వ్యక్తులు సీసీటీవీ కెమెరాలు, అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.