మెగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్
ABN , First Publish Date - 2020-09-28T12:07:49+05:30 IST
డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్తో కలిసి సైబరాబాద్ పోలీసులు ప్రారంభించిన మెగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్ను సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆన్లైన్లో ఆదివారం ప్రారంభించారు.
ఆన్లైన్లో ప్రారంభించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ, సెప్టెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్తో కలిసి సైబరాబాద్ పోలీసులు ప్రారంభించిన మెగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్ను సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆన్లైన్లో ఆదివారం ప్రారంభించారు. డ్రైవ్లో భాగంగా నగరంలో వివిధ ప్రాంతాల్లో 5000 ఆహార ప్యాకెట్లను అవసరం ఉన్న వారికి రాబిన్హుడ్ ఆర్మీ వంటి సంస్థల ప్రతినిధుల ద్వారా అందిస్తారు.
ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో గుంటూరు జాయింట్ కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆన్లైన్లో పాల్గొని డిగ్నిటీ డ్రైవ్ సంస్థతోపాటు ఇతర స్వచ్ఛంద సంస్థలు లాక్డౌన్ సమయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేశాయన్నారు. కార్యక్రమంలో కాగ్నిజెంట్ ఏవీపీ చింత సుబ్రహ్మణ్యం, కవిత తుములూరి తదితరులు పాల్గొన్నారు.