కుటుంబసమేతంగా ఓటు వేసిన హోంమంత్రి మహమూద్

ABN , First Publish Date - 2020-12-01T17:10:22+05:30 IST

మలక్‌పేట్ సర్కిల్ అజంపురా డివిజన్‌లో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కు వినియోగించున్నారు.

కుటుంబసమేతంగా ఓటు వేసిన హోంమంత్రి మహమూద్

హైదరాబాద్: మలక్‌పేట్ సర్కిల్ అజంపురా డివిజన్‌లో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కు వినియోగించున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తమ పార్టీని గెలుపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం ఉందన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు రావాలి హోంమంత్రి పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా ప్రాముఖ్యమైనదని స్పష్టం చేశారు. బల్దియా ఎన్నికల్లో వందకు పైగా డివిజన్లు టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని తెలిపారు. బల్దియా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-01T17:10:22+05:30 IST