నేడు హైకోర్టులో ఈసీ ఉత్తర్వులపై మరోసారి విచారణ
ABN , First Publish Date - 2020-12-07T14:21:12+05:30 IST
ఇతర ముద్రల ఓట్లకు సంబంధించి సింగిల్ జడ్జి ఉత్తర్వులపై నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరుగనుంది.

హైదరాబాద్: ఇతర ముద్రల ఓట్లకు సంబంధించి సింగిల్ జడ్జి ఉత్తర్వులపై నేడు హైకోర్టులో మరోసారి విచారణ జరుగనుంది. కోర్టులో ఎస్ఈసీ దాఖలు చేసిన అప్పీలుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం... సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. నెరేడ్మెట్లో ఫలితం నిలిచిపోయిందని ఎస్ఈసీ కోర్టుకు తెలుపగా...సిబ్బందికి శిక్షణ లోపమే కారణమని ధర్మాసనం అభిప్రాయపడింది. సింగిల్ జడ్జి వద్ద సోమవారమే విచారణ ఉన్నందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. సింగిల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యాక అభ్యంతరం ఉంటే అప్పీలు చేయాలని హైకోర్టు తెలిపారు. ఉదయం మొదట ఈ అంశమే విచారణ జరపాలని సింగిల్ జడ్జికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.