వాడెన్ డీడ్ స్కూల్లో హయత్నగర్ డివిజన్ ఓట్ల లెక్కింపు
ABN , First Publish Date - 2020-12-04T13:03:50+05:30 IST
జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హయత్ నగర్ సర్కిల్లో పరిధిలోని నాలుగు డివిజన్లకు హాయత్ నగర్లోని వాడెన్ డీడ్ స్కూల్లో లెక్కింపు జరుగనుంది. 13వ వార్డు హయత్ నగర్, 11వ వార్డు - నాగోల్, 14వ వార్డు - బి ఎన్ రెడ్డి నగర్, 12వ వార్డు - మన్సురాబాద్లకు సంబంధించిన ఓట్లను అక్కడ లెక్కించనున్నారు.