గురుకుల ప్రిన్సిపాల్ ఫలితాలు ప్రకటించాలి
ABN , First Publish Date - 2020-12-16T04:45:02+05:30 IST
గురుకుల ప్రిన్సిపాల్ ఫలితాలను ప్రకటించడంలో టీఎ్సపీఎస్సీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు మంగళవారం ప్రగతి భవన్ వద్ద ఆందోళన చేసేందుకు
ప్రగతి భవన్ వద్ద అభ్యర్థుల ఆందోళన.. అరెస్టు
బేగంపేట, డిసెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): గురుకుల ప్రిన్సిపాల్ ఫలితాలను ప్రకటించడంలో టీఎ్సపీఎస్సీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు మంగళవారం ప్రగతి భవన్ వద్ద ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని గోషామహల్, పంజాగుట్ట పోలీ్సస్టేషన్లకు తరలించారు. ఆందోళన సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ.. 2017లో గురుకుల ప్రిన్సిపాల్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువరించి, 2018లో పరీక్షలు నిర్వహించారని, 2019 సెప్టెంబర్ 4 నుంచి 9 వరకు అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు పూర్తి చేశారన్నారు. ఇప్పటి వరకు ఫలితాలను విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లపై ఉన్న కేసులను ప్రభుత్వం క్లియర్ చేయగానే ఫలితాలను విడుదల చేస్తామని చెప్పి ఏడాది గడిచిందన్నారు. ఫలితాలు విడుదలయ్యేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలని కోరారు.