గోసేన సభ్యత్వానికి మంచి స్పందన
ABN , First Publish Date - 2020-10-03T22:03:11+05:30 IST
ప్రతి గుడికో గోమాతను అందించడం, సంరక్షింపబడ్డ లక్ష గోవులతో భారీ గోశాలను తెలంగాణలో ఏర్పాటుచేసే దిశగా అడుగులు వేస్తున్న యుగ తులసి ఫౌండేషన్.....

ఖైరతాబాద్ అక్టోబర్ (ఆంధ్రజ్యోతి): ప్రతి గుడికో గోమాతను అందించడం, సంరక్షింపబడ్డ లక్ష గోవులతో భారీ గోశాలను తెలంగాణలో ఏర్పాటుచేసే దిశగా అడుగులు వేస్తున్న యుగ తులసి ఫౌండేషన్ కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోంది. రెండురోజులుగా జరుగుతున్న గో సేన సభ్యత్వానికి ఎంతో మంది స్వచ్చందంగా ముందుకు వస్తుండడంతో ఆదివారం మింట్ కాంపౌండ్లోని త్రిశక్తి హనుమాన్ దేవాలయం పరిసరాల్లో సందడి నెలకొంది. ఈ సందర్భంగా టిటిడి పాలకమండలి సభ్యులు, యుగ తులసి ఫౌండేషన్ నిర్వాహకులు కొలిశెట్టి శివకుమార్ మాట్లాడుతూ గోవులకు పూర్వ వైభవం తెచ్చేందుకు తమ ఫౌండేషన్ కృషి చేస్తోందన్నారు.
వీధికో గోశాలను ఏర్పాటు చేయడం, గోవుల ఆరోగ్యం కోసం ఆసుపత్రులు ఏర్పాటు చేయడం, గోపార్కులు ఏర్పాటు చేయడం, గో హత్యలను నిరోధించడం తదితర లక్ష్యాలతో ముందుకు వెల్తున్నామన్నారు. ప్రముఖ పర్యావరణప్రేమికులు, గో ఆధారిత వ్యవసాయ నిపుణులు విజయ్రాం ఫోండేషన్ కార్యక్రమాలను ప్రశంసించారు.




