టీఆర్ఎస్కు చుక్కలు చూపించిన బీజేపీ
ABN , First Publish Date - 2020-12-05T11:51:32+05:30 IST
టీఆర్ఎస్కు చుక్కలు చూపించిన బీజేపీ
స్వల్పమెజార్టీతో బయటపడిన టీఆర్ఎస్ అభ్యర్ధులు
హైదరాబాద్ : అల్వాల్ సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లలోనూ అధికార పార్టీ అభ్యర్థులు స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. సర్కిల్ పరిధిలో అంత బలంగాలేని బీజేపీ ఒక్కసారిగా అనుహ్యాంగా పుంజుకోవడంతో పాటు విజయానికి దగ్గరగా చేరుకుని ఓడిపోయింది. 3 డివిజన్లకు సంబంధించి 42 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి.
- అల్వాల్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయశాంతి 2,059 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి వీణాగౌడ్పై విజయం సాధించారు. విజయశాంతిరెడ్డికి మొత్తం 10,995 ఓట్లు వచ్చాయి.
- వెంకటాపురం డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సబిత కిషోర్ 1,166 ఓట్ల తేడాతో బీజేపీ శివ అభిషేక్పై విజయం సాధించారు. ఇక్కడ రెండు రౌండ్లలో సబిత కిషోర్కు 7,579 ఓట్లు వచ్చాయి.
- మచ్చబొల్లారం డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈఎస్ రాజ్జితేందర్నాధ్ 37 ఓట్ల స్వల్ప మెజార్టీతో బీజేపీ అభ్యర్థి సర్వే నరేశ్పై విజయం సాధించారు. రెండు రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్జితేందర్నాధ్కు 12,087 ఓట్లు వచ్చాయి.