పోలీసులనుంచి తప్పించుకోబోయి..
ABN , First Publish Date - 2020-06-07T10:44:03+05:30 IST
ఒకే బైక్పై ముగ్గురు మద్యం తాగి నిర్లక్ష్యంగా వెళుతుండగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. తప్పించుకోబోయి వారు
ఖైరతాబాద్ జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ఒకే బైక్పై ముగ్గురు మద్యం తాగి నిర్లక్ష్యంగా వెళుతుండగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. తప్పించుకోబోయి వారు గాయపడ్డారు. ఈ ఘటన సైఫాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. దిల్సుఖ్నగర్కు చెందిన పవన్ (18), సాయికుమార్ (19), సన్నీ (17) పల్సర్వాహనం( ఏపీ 09 సీఏ 8436పై ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైనుంచి పంజగుట్ట వైపునకు వెళుతుండగా ఖైరతాబాద్ చౌరస్తా వద్ద శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు ఆపబోయారు.
ఈ క్రమంలో వాహనం నడుపుతున్న పవన్ తప్పించుకునే ప్రయత్నంలో అదుపు తప్పి కింద పడ్డారు. దీంతో ముగ్గురికీ గాయాలయ్యాయి. పోలీసులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడక పోయినా, వారి చర్య సరైంది కాకపోవడంతో కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వాహనం నెంబరు సరిగ్గా కనిపంచకుండా దానిపై స్టిక్కర్ అంటించడం వీరి మరో నేరం. కొవిడ్-19 నిబంధనలను అతిక్రమించడం, మద్యం తాగి వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్, ఫోర్జరీ, ఛీటింగ్ కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు.