డంపింగ్‌ యార్డును పరిశీలించిన ఎమ్మెల్యే, మేయర్‌

ABN , First Publish Date - 2020-12-17T07:33:12+05:30 IST

అంబర్‌పేటలో చెత్త డంపింగ్‌ యార్డును స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి బుధవారం పరిశీలించారు

డంపింగ్‌ యార్డును పరిశీలించిన ఎమ్మెల్యే, మేయర్‌
డంపింగ్‌ యార్డును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు

అంబర్‌పేట, డిసెంబర్‌ 16 (ఆంధ్రజ్యోతి): అంబర్‌పేటలో చెత్త డంపింగ్‌ యార్డును స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌, గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. అంబర్‌పేట డంపింగ్‌ యార్డులో రాంకీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆటో కార్మికులతో సమావేశమయ్యారు. చెత్త తొలగింపుపై తడి, పొడి చెత్తలను వేరు చేయడంపై వారికి అవగాహన కల్పించారు. ఆటోకార్మికులు తమకు డంపింగ్‌ యార్డు వద్ద రూ.5 భోజన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరగా దీనిపై ఎమ్మెల్యే, మేయర్‌లు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి, డీఎంసీ వేణుగోపాల్‌, ఏఎంవోహెచ్‌ హేమలత, ఇంజనీరింగ్‌ అధికారులు ఆశాలత, సుధాకర్‌, రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు. డంపింగ్‌ యార్డును మేయర్‌ పరిశీలించడానికి వస్తున్న సమాచారాన్ని అధికారులు స్థానిక కార్పొరేటర్‌ జగన్‌కు చెప్పలేదని తెలిసింది. దీంతో ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.

Updated Date - 2020-12-17T07:33:12+05:30 IST