అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి : మేయర్
ABN , First Publish Date - 2020-08-16T09:43:03+05:30 IST
హైదరాబాద్లో మెరుగైన రోడ్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా, నిరుపేదలకు ఇళ్లు వంటి మౌలిక వసతులతోపాటు చారిత్రక వారసత్వ

హైదరాబాద్ సిటీ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్లో మెరుగైన రోడ్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా, నిరుపేదలకు ఇళ్లు వంటి మౌలిక వసతులతోపాటు చారిత్రక వారసత్వ సం పద పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మేయర్ రామ్మోహన్ అన్నారు. ఇక్కడి వసతులు, వాతావరణ పరిస్థితులను చూసి జాతీయ, అంతర్జాతీయంగా పేరొందిన సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తున్నాయన్నారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన జా తీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ డీఎస్ లోకే్షకుమార్ తదితరులు పాల్గొన్నారు.