జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌కు సైబర్ వేధింపులు

ABN , First Publish Date - 2020-12-30T21:13:30+05:30 IST

ప్రజా ప్రతినిధులకు కూడా సైబర్ వేధింపులు తప్పడం లేదు. వెంగళరావునగర్ కార్పొరేటర్‌ దేదీప్యపై అభ్యంతరకర వీడియోలతో

జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌కు సైబర్ వేధింపులు

హైదరాబాద్‌: ప్రజా ప్రతినిధులకు కూడా సైబర్ వేధింపులు తప్పడం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలోని వెంగళరావునగర్ కార్పొరేటర్‌ దేదీప్యపై అభ్యంతరకర వీడియోలతో వేధింపులకు గురిచేస్తున్నారు. సైబర్‌క్రైమ్‌ పోలీసులకు కార్పొరేటర్‌ దేదీప్య ఫిర్యాదు చేశారు. మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్‌తో పాటు బీజేపీ నేత వెంకట్‌పై కార్పొరేటర్‌ దేదీప్య అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కార్పొరేటర్ డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2020-12-30T21:13:30+05:30 IST