తల్లిని హత్య చేసిన కొడుకు
ABN , First Publish Date - 2020-12-28T06:54:19+05:30 IST
వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని ఓ ఆటో డ్రైవర్ కన్న తల్లిని గొంతు పిసికి హత్య చేశాడు.

జీడిమెట్ల, డిసెంబర్ 27(ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని ఓ ఆటో డ్రైవర్ కన్న తల్లిని గొంతు పిసికి హత్య చేశాడు. జగద్గిరిగుట్ట పోలీ్సస్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ(40) కూలి పని చేసుకుని జీవిస్తోంది. ఆమె కొంత కాలంగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలుసుకున్న ఆమె కుమారుడు ఆటో డ్రైవర్(24) ఆదివారం సాయంత్రం 3 గంటల సమయంలో తల్లి మెడకు దుప్పటి చుట్టి గొంతు పిసికి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.