దోమల నివారణతోనే సీజనల్‌ వ్యాధుల నియంత్రణ: సుధీర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-05-17T11:04:34+05:30 IST

ఎంటమాలజీ విభాగంగ ప్రతినిధులు దోమల వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వస్తువులతో బండ్లగూడలో మోడల్‌ స్టాల్‌

దోమల నివారణతోనే సీజనల్‌ వ్యాధుల నియంత్రణ: సుధీర్‌రెడ్డి

కొత్తపేట, మే 16(ఆంధ్రజ్యోతి): ఎంటమాలజీ విభాగంగ ప్రతినిధులు దోమల వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వస్తువులతో బండ్లగూడలో మోడల్‌ స్టాల్‌ ఏర్పాటు చేసి, కరపత్రాలను పంపిణీ చేశారు. ఎల్‌బీనగర్‌ జీహెచ్‌ఎంసీలో దోమల నివారణకు రసాయనాల స్ర్పేయింగ్‌ కోసం ఒకే డ్రోన్‌ అందుబాటులో ఉందని, చెరువుల్లో దోమల వ్యాప్తిని నివారించడానికి 5 డ్రోన్స్‌ సమకూర్చనున్నట్టు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వెల్లడించారు.


ప్రతీ కార్పొరేటర్‌ 2 ఫాగింగ్‌ మిషన్స్‌, 3 స్ర్పే మిషన్లు ఏర్పాటు చేసుకుంటారని, వాటి బాధ్యతను ఎంపిక చేసిన కార్యకర్తలకు అప్పగిస్తారన్నారు. తానూ సొంతంగా ప్రతీ డివిజన్‌కూ ఓ ఫాగింగ్‌ మిషన్‌ను సమకూర్చనున్నట్టు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్‌సీ ఉపేందర్‌రెడ్డి, డీసీలు విజయ్‌కృష్ణ, హరికృష్ణయ్య, మారుతీదివాకర్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-17T11:04:34+05:30 IST