దుబ్బాకలో టీఆర్ఎస్‌కు సరైన బుద్ధి చెబుతారు: విజయశాంతి

ABN , First Publish Date - 2020-11-03T13:45:27+05:30 IST

దుబ్బాక ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అహంకారపు ధోరణిలో

దుబ్బాకలో టీఆర్ఎస్‌కు సరైన బుద్ధి చెబుతారు: విజయశాంతి

హైదరాబాద్: దుబ్బాక ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అహంకారపు ధోరణిలో వ్యవహిరించిందంటూ కాంగ్రెస్ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దుబ్బాక ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌కు సరైన బుద్ధి చెబుతారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె..‘‘నిజాం నవాబులు తమ విధేయులైన దొరల దన్ను, ఆర్థిక, భూ బలాలు, కిరాయి బలగాలతో ఏ విధమైన అధికారం చెలాయించారో అదే ధోరణిలో నేటి నయా టీఆర్‌ఎస్ దొరలు ప్రజాస్వామ్యాన్ని తమ అహంకారపు అదుపాజ్ఞలలోని యంత్రాంగంగా వ్యవస్థీకృత చెల్లుబాటు చేసి... తెలంగాణ బిడ్డలపై నడిపించే ప్రక్రియ జరుగుతున్నదనేది వాస్తవం. విజ్ఞులైన మన తెలంగాణ ప్రజలు ఇది గమనించి దుబ్బాక ఎన్నికలలో టీఆరెస్‌కు సరైన బుద్ధి చెబుతారని విశ్వసిస్తున్నాను’’ అంటూ విజయశాంతి పేర్కొన్నారు.



Updated Date - 2020-11-03T13:45:27+05:30 IST