రైతుల దీక్షకు కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు?: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2020-12-28T18:47:53+05:30 IST

కేసీఆర్ తెలంగాణ రైతులను మోసం చేస్తున్నాడని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రైతుల దీక్షకు కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు?: జగ్గారెడ్డి

హైదరాబాద్: కేసీఆర్ తెలంగాణ రైతులను మోసం చేస్తున్నాడని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ సమర్దిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తా అన్న కేసీఆర్ రైతుల దీక్ష వద్దకు ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో కేసీఆర్ ఏం ఒప్పందాలు చేసుకున్నారని నిలదీశారు. ధాన్యం కొనుగోలు భారాన్ని ఎందుకు భరించం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నష్టం చేసే ప్రభుత్వ నిర్ణయంపై పోరాటం చేస్తామనితెలిపారు. కాంగ్రెస్ రైతుల వెంట ఉంటుందని..రైతులను కాపాడుకుంటుంది అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-28T18:47:53+05:30 IST