పెరిగిన నాటుకోడి ధరలు
ABN , First Publish Date - 2020-07-19T09:30:33+05:30 IST
బోనాల ఉత్సవాల్లో భాగంగా భక్తులు అమ్మవారికి నాటుకోళ్లతో మొక్కులు తీర్చుకుంటారు. ఈ నేపథ్యంలో నాటుకోడి కిలో...
![పెరిగిన నాటుకోడి ధరలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ముషీరాబాద్: బోనాల ఉత్సవాల్లో భాగంగా భక్తులు అమ్మవారికి నాటుకోళ్లతో మొక్కులు తీర్చుకుంటారు. ఈ నేపథ్యంలో నాటుకోడి కిలో రూ.360 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. అంతకు ముందు రోజుల్లో నాటు కోడి కిలో రూ.330 నుంచి రూ.350కి విక్రయించారు. చికెన్ సెంటర్లకు వరంగల్, నల్గొండ, సూర్యాపేట నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నాటుకోళ్లను పెద్దఎత్తున దిగుమతి చేసుకున్నారు.